సామాన్యుడికి షాక్… భారీగా పెరిగిన సిమెంట్ ధరలు.

-

సామాన్యుడి సొంతిటి కల మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ధరలతో సగటు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే.. డబ్బుల్ని నీళ్లలా ఖర్చు చేయాల్సిన వస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసమయ్యే సిమెంట్, ఐరన్, ఇసుక ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణాలకు కీలకమైన ఐరన్ ధరలు పెంచాయి కంపెనీలు. ఇటు సామాన్యుడిపైనే కాకుండా.. నిర్మాణ రంగంపై కూడా పెరిగిన ధరలు ప్రభావం పడనుంది.

తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు పెరిగింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ను బట్టి రూ.310 నుంచి రూ.400 వరకు ఉంది. గతేడాది నవంబర్ వరకు డిమాండ్ తక్కువగా ఉండటంతో కంపెనీలు రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది నుంచి డిమాండ్ పెరగడంతో పాటు ముడి పదార్థాల రేట్లు పెరగడంతో ధరలు పెంచడం తప్పట్లేదని కంపెనీలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news