బ్రేకింగ్; దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 991 మందికి కరోనా సోకగా 43 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,378 మందికి కరోనా వైరస్ సోకగా వారిలో 480 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాజస్థాన్ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న తెలంగాణా లో 66 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 38 మందికి కరోనా వైరస్ సోకింది. ఏపీలో 14 మంది కరోనా కారణంగా చనిపోగా తెలంగాణాలో 18 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. మే 3 వరకు లాక్ డౌన్ ని కొనసాగిస్తుంది కేంద్రం. 1991 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news