బిగ్ బ్రేకింగ్; ఏపీలో మరో 16 కరోనా పాజిటివ్ కేసులు టోటల్ 180…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. తాజాగా మరో 16 కేసులు పెరిగాయి. రెండు మూడు రోజుల నుంచి కరోన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ సభ్యులు నుంచే కరోనా కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. తాజాగా కరోనా కేసులు 180 కి చేరుకున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం ఉదయం 10 వరకు కొత్తగా,

కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉదయం రెండు కేసులు ఇప్పుడు మరో 14 కేసులు బయటపడ్డాయి. 16 కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ప్రభుత్వం భయపడుతుంది. కేంద్ర బలగాలను దింపాలని పలువురు కోరుతున్నారు. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news