తెలంగాణలో కొత్తగా 1,061 కరోనా కేసులు.. ఒకరి మరణం

-

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కరోనా వేవ్ అంతమైందని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇకపై కరోనాతో భయం పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో కరోనా కేసులు మరింతగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు వ్యాక్సినేషన్ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడంతో కరోనా నియంత్రణలో ఉంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో 69,892 శాంపిళ్లను టెస్ట్ చేయగా… 1061 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 7,79,971కి చేరింది. ఇక కొత్తగా కరోనా వల్ల రాష్ట్రంలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 4102గా ఉంది. తాజాగా కరోనా నుంచి 3590 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,470 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news