వైసీపీలో కరోనా కల్లోలం.. మరో ఎమ్మెల్యేకు కరోనా

-

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటున్నాయి, ముఖ్యమంత్రులు ఇద్దరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఎన్నో కఠిన నిబంధనలు పాటించే రాజకీయ నేతలను సెలబ్రిటీలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు.నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు దగ్గర నుంచి ప్రజా ప్రతినిధులు వరకు కరోనా బారినపడుతున్నారు.

తాజాగా సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఇకపోతే ఇదే జిల్లాలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సైతం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news