హైదరాబాద్ ‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కలకలం..!?

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటికే ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు కోవిడ్ నియమాలను పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి, సామజిక దూరం పాటించాలని అన్నారు.

corona
corona

అయితే తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో​ హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది. ఇక తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందా.. అనే సందేహాలు తలెత్తున్నాయి. అయితే వారి సందేహం నిజమేనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇవాళ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ ‌లో ఏకంగా ఎనిమిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో నలుగురు సెక్టార్ ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే, ఈ ఎనిమిది మందికి కోవిడ్ సోకడం ఇది రెండో సారి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత జూన్ నెలలో తొలిసారి కరోనా బారినపడ్డ ఈ పోలీసులు.. మరల ఇప్పుడు మరోసారి ఆ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు భయాందోళనలు నెలకొన్నాయి. చలి కాలంలో కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. మరోవైపు, రెండోసారి కోవిడ్ సోకిన కేసులు కూడా హైదరాబాద్‌ లో వెలుగు చూశాయి. ఎస్‌ఆర్ నగర్‌ లో ఏకంగా ఎనిమిది మందికి రెండోసారి కోవిడ్ సోకడం కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news