క‌రోనా టెస్టు చేయించుకున్న ప‌వ‌న్ ‌.. రిపోర్టు ఏం వ‌చ్చిందంటే?

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. చిరంజీవి త‌మ్ముడిగా ఇండస్ట్రీకి వ‌చ్చినా… త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌రుచుకున్నారు. ప‌వ‌నిజం అనే ప్ర‌త్యేక మేన‌రిజానికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారంటే ప‌వ‌న్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే ఇండ‌స్ట్రీ లెక్క‌లు మారిపోరిపోతాయి. ఇక అలాంటిప‌వ‌న్ నుంచి మూడేళ్ల త‌ర్వాత వచ్చిన సినిమా వ‌కీల్ సాబ్‌.

వ‌కీల్ సాబ్ వ‌స్తోంద‌న్న‌ప్ప‌టి నుచి విప‌రీత‌మైన అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక సినిమా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా బాగానే చేశారు. అయితే ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న నివేథా తామ‌స్ కు క‌రోనా పాజిటివ్ రావడంతో టీంకు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అలాగే ప్రీరిలీజ్ వేడుక‌లో పాల్గొన్న బండ్ల గ‌ణేశ్ కు కూడా క‌రోనా రావ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించింది. దీంతో ప‌వ‌ర్ స్టార్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అయితే ఈ రోజు ఉద‌యం ఆయ‌న ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్ కు వెళ్లి కరోనా టెస్టు చేయించుకున్న‌ట్టు స‌మాచారం. ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కూడా ప‌వ‌న్ తో పాటు హాస్పిట‌ల్ కు వ‌చ్చారు. అయితే ప‌వ‌న్ కు నెగెటివ్ రిపోర్టు వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో ఫ్యాన్స్ ను ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news