ఏపీలో కరోనా భీభత్సం.. 24 గంటల్లో 93 మరణాలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 93 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,111కి చేరింది. మొత్తం 3,282 మంది మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు 2,60,087 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కాగా, కేవలం గడిచిన 24 గంటల్లోనే 7,449 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32,38, 038 టెస్టులు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news