రాజధానిపై కరోనా పంజా.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే..!

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు. కాగా, తాజాగా.. గ‌డిచిన 24 గంట‌ల్లో 3,229 క‌రోనా కేసులు న‌మోదు కాగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,21,533కు చేరుకుంద‌ని వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవాళ 26 మంది వ్యాధి బారిన ప‌డి మ‌ర‌ణించ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు 4,770 మంది మృత్యువాత ప‌డ్డారు. 1,88,122 మంది ఇప్పటివ‌ర‌కు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం 28,641 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news