కరోనా కలవరం.. భారత్ నయా రికార్డ్..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, తాజాగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

corona virus
 

కరోనా కారణంగా 606 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,876 కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 24,915కి పెరిగింది. కరోనాతో ఇప్పటి వరకూ కోలుకుని 6,12,814 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్ లో 3,31,146 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news