భారత్ లో కరోనా కలవరం.. 24 గంటల్లో ఎన్ని మరణాలంటే..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, తాజాగా గత 24 గంటల్లో 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493కి చేరుకుంది. అలాగే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 17,400కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,47,979 మంది బాధితులు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 2,20,114 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news