ఈట‌ల‌కు బీసీ క్రేజ్ త‌గ్గించాలె.. టీఆర్ ఎస్ మాస్ట‌ర్ స్కెచ్‌

-

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రోజురోజుకూ మ‌రింత రాజుకుంటున్నాయి. హుజూరాబాద్ వేదిక‌గా రాష్ట్ర నాయ‌కులు చ‌క్రం తిప్పుతున్నారు. మంగ‌ళ‌వారం హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ పెట్టిన ప్రెస్‌మీట్ ఒక్క‌సారిగా రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపింది. అయితే ఇక్క‌డ టీఆర్ ఎస్ ప‌ట్టు సాధించ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేసింది.

ఈట‌ల రాజేంద‌ర్‌కు ఉన్న‌బీసీ ఇమేజ్‌ను దెబ్బ‌కొట్టాల‌ని చూస్తోంది. ఇందుకోసం బీసీ నేత‌ల‌తోనే ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేయిస్తోంది. ఇందులో భాగంగానే గంగుల క‌మ‌లాక‌ర్ తాను ఫుల్ బీసీ అని ఈట‌ల హాఫ్ బీసీ అని ప‌దే ప‌దేచెప్తున్నారు.

హుజూరాబాద్‌లో ఎన్నిక‌లు వస్తే కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఫ్యామీలీని, లేదా వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపాల‌ని భావిస్తోంది టీఆర్ ఎస్‌. అందుకే అగ్ర సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లెవ‌రూ విమ‌ర్శ‌లు చేయ‌ట్లేదు. బీసీ మంత్రిగా గంగుల‌ను ఫోక‌స్ చేస్తూ ఈట‌ల‌ను దెబ్బ‌కొట్టాల‌ని టీఆర్ ఎస్ అధిష్టానం భావిస్తోంది. మ‌రి ఈ ప్లాన్‌ను ఈట‌ల రాజేంద‌ర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news