దీపిక పదుకొనే ఫోటో పెట్టి.. లోపల మాత్రం అవినీతి..!

-

ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరికీ మేలు చేయాలని చూస్తే మధ్యలో ఉన్న కొంతమంది అధికారులు మధ్య దళారీల కంటే దారుణంగా దోచుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా లేని మనుషులను ఉన్నట్లుగా చూపించి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలతో లక్షలు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.

ఎవరినో ఎందుకు వాడుకోవడం అనుకున్నారో ఏమో ఇక ఏకంగా బాలీవుడ్ తార దీపికా పదుకొనే ఫోటోతో అక్రమాలకు పాల్పడ్డారు అధికారులు. మధ్యప్రదేశ్ లో మన్రే జాబ్ కార్డులపై దీపిక పదుకొనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లాంటి బాలీవుడ్ తారల ఫోటోలు ఉండడం సంచలనంగా మారిపోతుంది. కొన్ని గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు అధికారులు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే ఎంతో మంది ఉపాధి దొరక్క అల్లాడిపోతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news