లోన్లు ఇప్పిస్తామంటూ.. భార్యభర్తల నయా మోసం

-

కామారెడ్డి   మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భార్యాభర్తలు రుణాలు ఇప్పిస్తామంటూ అక్కడి ప్రజల దగ్గర సుమారు 20 లక్షల వరకు నగదు వసూలు చేశారు. బాధితులు రుణాలు ఇవ్వాలని అడగగా భార్యాభర్తలు ఇద్దరు చేతులెత్తేశారు. దీనికి ముందు కూడా కొంతమంది బాధితులు ఆ గ్రామనికి చెందిన దంపతులు శ్రీహరి- వాణిలు ఏర్పాటు చేసిన జిడీఎఫ్సీ సంస్థ వద్దకు చేరుకొని యజమాని శ్రీహరిని నిలదీశారు. రుణాల కోసం ఇచ్చిన సర్టిఫికెట్లను, డబ్బులను ఇవ్వాలని గట్టిగ అడిగారు బాధితులు. అలాగే కొంతమంది డబ్బులు కట్టడంతో వాటికి బదులు జిడీఎఫ్సీ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా స్థానికులు సముదాయించారు.

arest – Sathyam Online

ఇంక శ్రీహరి దాచిపెట్టిన సర్టిఫికెట్లను తెప్పించుకొని మరీ తీసుకెళ్లారు బాధితులు. అనంతరం బాధితులకు డబ్బులను వారం వ్యవధిలో చెల్లిస్తామని హామీ ఇచ్చాడు శ్రీహరి. ఒక వారం గడిచినప్పటికీ బాధితులు చెల్లించిన డబ్బులు ఇవ్వక పోవడంతో బాధితులు శ్రీహరి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో శ్రీహరి వాణీ దంపతులు బాధితుల పై తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులందరూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లి శ్రీహరి వాణి దంపతులు రుణాలు ఇప్పిస్తామని మోసం చేశారని దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు 20 లక్షల వరకు 250 మంది బాధితుల వద్ద వసూలు చేసి చేతులు ఎత్తేశారని సమాచారం. ఈ విషయమై పోలీసులు శ్రీహరి వాణి దంపతులపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు బాధితులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news