బ్రేకింగ్ న్యూస్: ఒక్క రోజులో 1,94,270 కేసులు.. 11.5శాతానికి పాజిటివిటీ రేటు

-

దేశంలో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,270 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫెక్షన్ కారణంగా 442 మంది ప్రాణాలను కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 15.8శాతం కేసులు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. మంగళవారం 1.68లక్షల కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. రోజువారీ పాజిటివిటీ రేటు 11.5శాతానికి చేరుకున్నది. అంటే కరోనా టెస్టు చేసిన ప్రతి 100 మందిలో 11.5శాతం మందికి కరోనా సోకుతుందని కేంద్ర ప్రభుత్వం ఉదయం డేటా ద్వారా వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 4,868లకు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news