ముంపునకు గురైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందే – సీపీఐ నారాయణ

-

ముంపునకు గురైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిం దేనని ప్రకటించారు సీపీఐ నారాయణ. 5 గ్రామాలను తెలంగాణ లో కలుపదానికీ అభ్యంతరం లేదని చంద్ర బాబు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నప్పుడే రెండు రాష్ట్రాలు రాజకీయాలు ప్రక్కన పెట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత ఉందని.. కాపాడాల్సిన బాధ్యత నుండి తప్పించుకోవటానికే రెండు ప్రభుత్వాలు ఉద్దేశ్యం పూర్వకంగానే ప్రవర్తిస్తున్నాయని నిప్పులు చెరిగారు.

మునిగిన ప్రాంతాలు కాపాడుకోవడం విస్మరించి రెండు రాష్ట్రాల మంత్రులు ఉద్దేశ్య పూర్వకంగానే విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణలోకి ఐదు గ్రామాలను కలిపే అంశం పై CPI పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఇన్వెస్టగేషన్ ఏజన్సీలు మోడీకి అనుకూలంగా వ్యవరిస్తున్నాయని.. వరద ముంపు ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని రెండు రాష్ట్రలు జాతీయ విపత్తుగా గుర్తించాలని అడగాలి…ఐదు గ్రామాలను తెలంగాణ లో రావటానికి ఎటువంటి అభ్యతరం లేదని చంద్రబాబు తెలిపాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news