ప్రధాని మోదీపై సిపిఐ రామకృష్ణ కీలక వ్యాఖ్యలు

-

ప్రధాని నరేంద్ర మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని నరేంద్ర మోదీ తీరు దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 మంది వేల కోట్లు ఎగ్గొట్టి కొందరు విదేశాలకు పారిపోయారని దుయ్యబట్టారు. బ్యాంకుల్లో వేల కోట్లు కొల్లగొట్టిన వాళ్లలో విజయ్ మాల్యా తప్ప అందరూ గుజరాత్ కు చెందిన వారేనని అన్నారు. అదానీ స్కాంలను చూసి ప్రపంచమే ఆశ్యర్యపోతోందన్నారు రామకృష్ణ.

మోదీ ప్రధాని కావటానికి అదానీ దేశమంతా తిరిగారని.. మోదీ ప్రధాని అయిన తర్వాత అదానీని ప్రపంచ కుబేరులలో రెండవ స్ధానానికి తీసుకు వెళ్లారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాలుగేళ్ల క్రితం మాట్లాడితే ఇవాళ శిక్షలు వేశారని.. రాహుల్ గాంధీ క్వార్డర్స్ కూడా ఖాళీ చేయమన్నారని మండిపడ్డారు. ఇక సీఎం జగన్ డిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో పోలవరం విషయంలో కేంద్రం టీడీపీ సభ్యులకు ఒక రకంగా, వైసీపీ సభ్యులకు మరొక రకంగా సమాధానాలు చెబుతుందని మండిపడ్డారు రామకృష్ణ.

పోలవరానికి నిధుల్లో కోత పెట్టి రిజర్వాయర్ స్దాయికి కుదిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కు వివేకా కేసు తలకు మించిన భారంగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ లో కూడా ఎవరు తప్పు చేశారో గంటలో కనుకున్నారని కానీ.. వివేకా హత్య కేసులో నిందితులను నాలుగేళ్లయినా తెలియటం లేదన్నారు. సీఎం జగన్.. అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడటానికి డీల్లీ వెళ్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news