తెలంగాణలో దారుణం..ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌

-

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండిగల్ లో మహిళపై నలుగురు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సోలాపూర్ నుంచి రెండు రోజుల కిందట దుండిగల్ కు వచ్చిన ఓ మహిళపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి గండిమైసమ్మ ప్రాంతంలోని వారు వెనుక ఖాళీ ప్రదేశం లోకి తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడిన ప్రాథమిక సమాచారం అందుతోంది.

స్థానికుల సమాచారం తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడ్డ నరసింహ, ఇమామ్, కుద్దుసు, ఉమృ దీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే బస్తీవాసులు గా గుర్తించారు పోలీసులు. మీరు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news