హైదరాబాద్ లో కృష్ణా జిల్లా యువతి ఆత్మహత్య…!

-

హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువతి హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాల వల్ల ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే … కృష్ణాజిల్లా కు చెందిన పాలకుర్తి శాంతి అనే యువతి భాగ్యనగర్ ఫేస్-2 లోని తనుజ హాస్టల్ లో నివాసం ఉంటోంది. శాంతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే కొంతకాలంగా ఆమె బాధ అనారోగ్యంతో పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం శాంతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె తీయకపోవడంతో శాంతి తల్లి హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసింది. దాంతో నిర్వాహకులు శాంతి గదికి వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించింది. దాంతో వెంటనే హాస్టల్ నిర్వాహకులు తల్లితో పాటు ఆమె సోదరుడికి సమాచారం అందించి.. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే శాంతి తల్లిదండ్రులు కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news