శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వ్యక్తి మృతి

-

శంషాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం వికఠించి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో హస్పటల్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల అందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బూర్కుంట గ్రామానికి చెందిన పత్లావత్ లక్ష్మణ్ కు యాక్సిడెంట్ కావడంతో అర్కాన్ హస్పటల్ లో అడ్మిట్ చేశారు. లక్ష్మణ్ కు వైద్యులు అపరేషన్ చేసి రెండు రోజుల క్రితం ఇంటికి పంపించారు.

ఇంటికి వెల్లిన లక్ష్మణ్ కు మళ్ళీ పరిస్థితి విషమించడంతో హస్పటల్ కు తీసుకురాగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు లక్ష్మణ్. అయితే వైద్యుల నిర్లక్ష్యమే లక్ష్మణ్ మృతికి కారణమని కుటుంబ సభ్యులు బంధువుల అందోళనకు దిగారు. హస్పటల్ వద్ద పరిస్థితి ఉదృతంగా ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లక్ష్మణ్ మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news