వరకట్నం వేధింపులు తాళలేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న మహిళ

-

విశాఖలోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భర్త, అత్తింటి వారి వేధింపులు తాలలేక ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. వెంటనే వారిని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లి శైలజ (34) మృతి చెందింది. ఏడాది వయసు గల చిన్నారి అక్షిత కూడా మృతి చెందింది. పెద్ద పాప తుషిత (4) పరిస్థితి విషమంగా ఉంది.

భర్త సంపంగి మోహన్ కృష్ణ, అత్త వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సంపంగి మొహన్ కృష్ణతో 2017లో శైలజకు వివాహం జరిగింది. తరచూ వరకట్నం కోసం వేధిస్తూ ఉండేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న సాయంత్రం సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ లో తన సోదరికి పంపింది శైలజ. అనంతరం పురుగుల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎంవిపి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news