శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌లో దారుణం…24 గంటల్లో ఇద్దరు ఉద్యోగుల సూసైడ్

-

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో సిఐఎస్ ఏఫ్ ఉద్యోగుల ఆత్మహత్య కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవదిలో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్యలపై అదికారులు విచారణ కొనసాగిస్తున్నారు. చెట్టు ఊరివేసుకుని ఛత్తీస్‌గఢ్ కు చెందిన కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకుంది.


29 ఎళ్ళ చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపిక కాగా…. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇక తాజాగా షార్‌ మొదటి గేటువద్ద కంట్రోల్‌ రూమ్‌లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్..గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక రోజు గడువక ముందే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో సహచరులు ఆందోళన చెందుతున్నారు. చింతామణి మృతదేహానికి పోస్టు మార్డం పూర్తి చేసి చార్జ్ కు తరలించారు అధికారులు. ఉదయం 12 గంటలకు వికాస్ సింగ్ మృతదేహానికి పోస్టు మార్టమ్ జరుగనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news