వరంగల్ లో దారుణం; అమ్మాయి గొంతు కోసి…!

-

దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు. దిశా అత్యాచారం హత్య ఘటన మరువక ముందే దారుణం జరిగింది. వరంగల్ జిల్లా హన్మకొండ లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఒక యువతీ గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే హన్మకొండలోని,

రాంనగర్‌లో హారతి, షాహిద్ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న షాహిద్ పలు మార్లు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. అనుమానపు ప్రశ్నలు వేస్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలోనే అనుమానం మరింత ఎక్కువ కావడంతో శుక్రవారం ఆమెపై బ్లేడ్‌తో దాడి చేశాడు. పదునైన బ్లేడ్‌తో గొంతు కోయడంతో,

తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. ఘటన అనంతరం నిందితుడు షాహిద్ జడ్జి ముందు లొంగిపోగా, జడ్జి అతన్ని పోలీసులకు అప్పగించారు. నిందితుడు షాహిద్ స్వస్థలం కాజీపేట్‌గా గుర్తించిన పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news