ఈఎంఐ చెల్లించనందుకు ప్రాణాలు తీశారు

-

రుణం తీసుకున్న వ్యక్తి కిస్తీ చెల్లించనందుకు దారుణంగా హత్య చేసిన సంఘటన ధంకవాడిలో చోటుచేసుకున్నది. మృతుడు షంబాజీనగర్‌కు చెందిన శరద్ శివాజీ అవారే(43)గా పోలీసులు గుర్తించారు. అవారే మిత్రుడు ప్రశాంత్ కదం ఫిర్యాదు మేరకు హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి శివాజీ అవారే కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. నెలవారీగా అప్పు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే, నవంబర్‌లో కిస్తా చెల్లించడంలో శివాజీ అవారే విఫలమయ్యాడు. ప్రశాంత్ కదం ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి 11గంటలకు నవాలే బ్రిడ్జి సమీపంలోని సర్వీసు రోడ్డు వద్ద అవారేను రుణదాతలు కలిసి కిస్తీ గురించి గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. వారే అతడిని హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శివాజీ అవారే, ప్రశాంత్ కదం సంయుక్తంగా దుకాణం నిర్వహిస్తున్నాడు. కానీ, వ్యక్తిగత అవసరాల కోసం రుణం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నాం. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news