పులిని పట్టుకోవడానికి తీసుకొస్తే మహిళను పొట్టన పెట్టుకుంది…!

-

మనుషులను చంపే పులిని పట్టుకోవడం చేసిన ఆపరేషన్ లో ఓ మహిళ బలయిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ లో చోటు చేసుకున్నది.

యావత్మల్ ఏరియాలో ఓ ఆడపులి, దాని రెండు పిల్లలు తిరుగుతున్నాయని.. ఆ ఆడ పులి ఇప్పటి వరకు ఆరుగురికి చంపేసిందని దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని సుప్రీం కోర్టు అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ పులి ఆచూకీ కోసం ఐదు ఏనుగులను రంగంలోకి దించారు పోలీసులు. అందులో గిరిరాజ్ అనే ఓ మగ ఏనుగు గొలుసులు తెంచుకొని అక్కడి నుంచి పారిపోయింది. దీంతో అధికారులు దాన్ని పట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. అలా పారిపోతూ రాలేగావ్ కు చెందిన ఓ మహిళను తొండంతో కొట్టి చంపింది. మరో వ్యక్తికి గాయపరిచింది. చివరకు దాన్ని ఎలాగోలా పట్టుకొని నిర్బంధించగలిగారు అధికారులు. ఒక పని కోసం వస్తే మరేదో పని పడిందని.. అసలు విషయం వదిలేసి ఈ ఏనుగును పట్టుకోవడం కోసమే తిరగడం జరిగిందని అధికారులు వాపోయారు. మొత్తం 200 మంది పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి అడవి అంతా వెతికినా ఆ ఆడపులి జాడ మాత్రం తెలియరాలేదట. ఎక్కడ దాక్కుందో దొంగ పులి.

Read more RELATED
Recommended to you

Latest news