భర్త పనిమీద వెళ్ళగానే మరిదితో ఎఫైర్, అడ్డుగా ఉన్నాడని!

-

బీహార్ లో దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న నవ్ ఘాజియాలోని గోపాల్ పూర్ పరిధిలో దారుణమైన ఉదాంతం జరిగింది. జూలై 26న జరిగిన ఈ అమానవీయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యాభర్తలు. అయితే వీరితోపాటు భర్త, సోదరుడు కూడా ఒకే ఇంట్లో ఉండేవారు. ఈ క్రమంలో ప్రీతి గుప్తా మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఉద్యోగం మీద వెళ్ళగానే ఇద్దరు కలిసి గడిపేవారు.

అయితే తమ గుట్టు ఎక్కడ భర్తకు తెలిసిపోతుందో అనుకుంటూ భయపడేవారు. భర్త అడ్డు తొలగించుకుంటే యదేచ్ఛగా తిరగొచ్చని భావించారు. అందుకు భార్య ప్రీతి గుప్తా మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను చంపాల్సిందిగా ఒక లక్ష రూపాయలను సుపారీగా ఇచ్చింది. దీనికోసం అడ్వాన్స్ గా 20,000 కూడా ఇచ్చింది.

అయితే భర్త ఉద్యోగం నుంచి ఇంటికి వస్తుండగా కొంతమంది ఆటకాయించి, పిస్టల్ తో కాల్చి, కత్తులతో పొడిచి చంపారు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి భార్యా, సోదరుడి వాళకం అనుమానస్పదంగా ఉండటంతో, ఇద్దరినీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమదైన రీతిలో విచారించారు. కాల్ డాటాను పరిశీలించారు. ఈ క్రమంలో తాము ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసినట్టు అంగీకరించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కళకళంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news