ఫ్రెండ్​తో కలిసి గుడికి వెళ్లినై బాలికపై గ్యాంగ్ రేప్

-

స్నేహితుడితో కలిసి గుడికి వెళ్లిన ఓ మైనర్ బాలికపై కొందరు దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని రీవాలో చోటుచేసుకుంది. ఆమె స్నేహితుడిపై దాడి చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కూడా తీవ్రంగా కొట్టి అక్కణ్నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు సహా మొత్తం ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ముగ్గురు నిందితుల అక్రమ భవన నిర్మాణాల్ని కూల్చివేసింది జిల్లా యంత్రాంగం. నేరంలో పాల్గొన్న మరో ముగ్గురు విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

బాధితురాలు తన స్నేహితుడితో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. అయితే ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నలుగురు వ్యక్తులు సహా ఇద్దరు మైనర్లు అక్కడికి వచ్చారు. బాలిక​ స్నేహితుడిపై దాడి చేసి ఆమెను సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news