పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే…రాజకీయ అనుభవం లేదు – కాకాని గోవర్ధన్ రెడ్డి

-

పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే…రాజకీయ అనుభవం లేదని విమర్శలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారు.. విలువైన సభా సమయాన్ని వృధా చేస్తూ సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఘనకార్యం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి… సమస్యలపై చర్చించే దమ్ము ధైర్యం లేదన్నారు.

ఆ సమస్యపై ప్రశ్న వేసిన టీడీపీ సభ్యులు కూడా దాని గురించి మాట్లాడటం లేదని.. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకుండా బయట మీడియా ముందు డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. సభలో చర్చిస్తే వాస్తవాలు ప్రజలకి తెలుస్తాయి.. అలా చర్చ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని వారి భయం అని చురకలు అంటించారు.

మూడు రాజధానుల విషయంలో సీఎం ఇచ్చిన వివరణ చూసిన తర్వాత ప్రజల్లో చర్చ ప్రారంభం అయిందన్నారు. అవగాహన, అనుభవం లేని వ్యక్తి మాటలు పట్టించుకోనవసరం లేదని.. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే…రాజకీయ అనుభవం లేదని ఎద్దేవా చేశారు. ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన రాజకీయ అనుభవం పవన్ దని.. ప్రజలు తమకు సమాధి కట్టడానికి సిద్దంగా ఉన్నారు అనేది చంద్రబాబుకి తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news