డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీలు.. తల్లీకుమారుడి దుర్మరణం

-

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం పల్టీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో సీదెళ్ల ఫణికుమార్‌(43), ఆయన తల్లి సీదెళ్ల కరుణ(62) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news