మహిళలకు శిరోముండనం ఘటనపై పోలీసులు సీరియస్

-

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం రామగుండ్ల తండాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలకు గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో శిరోముండనం చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న పదహారేళ్ల రమావత్ రాజకుమార్ అనే పదహారేళ్ల యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు.

యువకుడి మరణం పై ఆరా తీసిన గ్రామ పెద్దలు రాజకుమార్ తో ఇద్దరు మహిళల అక్రమ సంబంధం బయటపడిందని.. సదరు మహిళలు రాజకుమారును చంపేశారు అంటూ అనుమానించారు. దీంతో గ్రామస్తులు అందరూ చూస్తుండగానే మహిళలకు గుండు కొట్టించారు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. IPC 342, 355, 323, 504, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతాం అని దేవరకొండ డి.ఎస్.పి నాగేశ్వరరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news