ఒక్కొక్కటిగా బయటపడుతున్న రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య బాగోతాలు

-

సంగారెడ్డి లోని రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాసుల కక్కుర్తికి అలవాటు పడి భూములను వేరే వారికి పట్టా చేశాడు రాజయ్య. గత నెల సెప్టెంబర్‌ 20న బతికున్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి 28 ఎకరాల భూమిని వేరే వారి పేరుపై పట్టా చేశాడు రాజయ్య. ఇప్పుడు రాజయ్య బాగోతం మరోసారి బయటపడింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్టు చిత్రీకరించి అతని భూమిని వేరేవారి పేరుపై పట్టా చేశాడు రాజయ్య.

రాయికోడ్ (మం) నాగ్వార్ గ్రామంలో సర్వే నెంబర్ 79/అ1 లో మోహన్ అనే యువకుడికి 4.35 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఈ సంవత్సరం జూలైలో మోహన్ ని చనిపోయినట్టు చిత్రీకరించి సంగన్న అనే వ్యక్తికి పట్టా చేశాడు రాజయ్య. కులం వేరైనా ఒకటే కులంగా చిత్రీకరించాడు రాజయ్య. భూమి అమ్ముదామని ధరణి వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో లబోదిబోమంటూ ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లాడు బాధితుడు.

Read more RELATED
Recommended to you

Latest news