భోలే బాబాను ప్రసన్నం చేసుకోవాడనికి ఆరేళ్ల బాలుడిని హత్య చేసిన యువకులు..

-

మూఢనమ్మకాల మాటున మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు. కన్నకూతుళ్లను దేవడికి బలిచ్చారు ఓ తల్లిదండ్రులు..అప్పుడా వార్త యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అలాంటివి ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆరేళ్ల బాలుడిని చంపేశారు ఇద్దరు వ్యక్తులు.. దిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం.. సీఆర్​పీఎఫ్​ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో పనికి చేరింది. వారికి ఓ ఆరేళ్ల కొడుకు ఉన్నాడు..శనివారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో.. భవనానికి సమీపంలో ఓ బాలుడి మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. అతడి గొంతు కోసేసి ఉండటంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అటుగా వెళుతున్న నిందితులను వారందరు పట్టుకున్నారు. మరణించింది.. తమ బిడ్డే అని తెలిసి.. ఆ వలస కుటుంబం బోరున విలపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకుని అరెస్ట్​ చేశారు.

నిందితులు.. బిహార్​కి చెందిన 23ఏళ్ల విజయ్​ కుమార్​, 21ఏళ్ల అమర్​ కుమార్‌గా గుర్తించారు.​. “నిందితులు ఇద్దరు కలిసి గాంజా కొట్టేవారు. వారు కూడా భవన నిర్మాణంలో పనిచేసిన కూలీలే. గంజా కొడుతున్న వారిద్దరని స్థానికులు మందలించారు. దాంతో వారిద్దరికి కోపం వచ్చి..ఇక తన కలలోకి భోలే బాబా వచ్చాడని, ఓ బాలుడి మెడ కోసేయాలని ఆదేశించినట్టు నిందితుల్లో ఒకడు చెప్పాడు. ఈ క్రమంలోనే 6ఏళ్ల బాలుడిని చంపేశామని వాళ్లు తెలపడంతో. పోలీసులు షాక్‌ అయ్యారు..

శనివారం రాత్రి.. బాలుడు తన షెడ్డుకు వెళుతుండగా.. అతడిని ఆ ఇద్దరు పిలిపించారు. వారిద్దరు ముందే తెలుసు కాబట్టి.. బలవంతం లేకుండానే వారి వద్దకు ఆ బాలుడు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడిని చంపేశారని పోలీసులు తెలిపారు. నిందితులపై బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. దుర్గా పూజల వేళ త్యాగాలు చేస్తే.. శాంతి లభిస్తుందని ఆ ఇద్దరు తరచూ మాట్లాడేవారని వాళ్లు తెలిపారు. అనవసరమైన నమ్మకాలతో నిండు ప్రాణం తీశారు. వీరిని కఠినంగా శిక్షించాలని విషయం తెలిసిన నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news