ప్రాణాల మీదకు తెచ్చిన ఫస్ట్‌ నైట్!

-

కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు మనసు తెలుసుకొని మసలుకో వలసిన భర్త… పెళ్లయిన నాలుగు రోజులకే పేచీ పెట్టడం ఆమెను కుంగదీసింది. శోభన రాత్రి తనకు సహకరించడం లేదంటూ అందరికీ చెప్పడంతో ఆత్మన్యూనతకు గురై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.కనీసం అర్థం చేసుకోకుండా కుటుంబసభ్యులు కూడా ఆమెని ప్రశ్నించడంతో సిగ్గుతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బొట్టు చెరువు కు చెందిన శంక‌ర్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట పరిధిలోని ప్రగతి న‌గ‌ర్ లో నివాసం ఉంటున్నాడు. శంక‌ర్ మేస్తిరి గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఇటీవల తన పెద్ద కుమార్తె కి ఈ నెల 6వ తేదీన గ్రామంలో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. వివాహానంతరం సాంప్రదాయ ప్రకారం ఈనెల 9న శోభనం ఏర్పాటు చేశారు.

అదే నవ వధువుకి చేదు అనుభవం మిగిల్చింది. నూతనంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన యువతి మనసు తెలుసుకోకుండా తనకు సహకరించడం లేదంటూ వరుడు పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. అందరికీ తెలిసి పోవడంతో ఆమె ఆత్మన్యూనతకు గురైంది.కుటుంబ సభ్యులు కూడా ఆమెను ప్రశ్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురైనా నవ వధువు నాలుగు రోజులు తిరక్కుండానే ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.శోభనం రాత్రి జరిగిన గొడవ కారణంగానే తమ కూతురు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news