ప్రియుడితో కలిసి తండ్రిని హ‌త‌మార్చిన కూతురు.. శ‌రీరాన్ని కోసి మ‌రీ..

-

పెద్ద మనసుతో అమ్మాయిని దత్తత తీసుకున్నాడు ముంబయికి చెందిన బెన్నెట్‌ రెబెల్లో (59) అనే వ్యక్తి. అయితే, ప్రియుడి మోజులో పడ్డ ఆ అమ్మాయి తనకు అన్నం పెట్టి పెంచుతోన్న ఆ వ్యక్తినే అతి దారుణంగా హత్య చేసింది. మహారాష్ట్రలో ఈ ఘటన కలకలం రేపింది. ముంబైలో ఉంటున్న బెన్నెట్‌ రెబెల్లో (59) ఘట్కోపర్‌ ప్రాంతంలోని రియా (19) అనే యువతిని రెండేళ్ల కింద దత్తత తీసుకున్నాడు. అయితే రియా ఓ మైనర్‌తో ప్రేమాయణం సాగిస్తుండడంతో గమనించిన తండ్రి, మైనర్‌తో ప్రేమ వ్యవహారం మంచిది కాదని కుమార్తెకు హితవు చెప్పేవాడు.

దీంతో ఆమెను బెన్నెట్‌ రెబెల్లో హెచ్చరించాడు. తన ప్రియుడితో కలిసి గతనెల 27న తండ్రిపై దాడి చేసి చంపేసింది. కత్తితో తండ్రి శరీర భాగాలను ముక్కలుగా కోసి, ఆ శరీర భాగాలను రెండు సంచులు, ఒక సూటుకేసులో నింపి తీసుకెళ్లి మిథి నదిలో పడేసింది. మూడు రోజుల తర్వాత సూటుకేసు గురించి సమచారం అందడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చివరకు కేసును ఛేదించారు.

Read more RELATED
Recommended to you

Latest news