MAA ELECTIONS : తెలంగాణ బిడ్డలను గెలిపించండి.. ప్రకాష్ రాజ్ ను ఓడించండి : సీవిఎల్ నరసింహారావు

-

నటుడు సీవి ఎల్ నరసింహారావు సంచలన కామెంట్స్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను మాత్రమే గెలిపించాలని సీ వి ఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించాలాని కోరారు సీ వి ఎల్ నరసింహారావు.

దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాష్ రాజ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేకుండా వుంటే బాగుంటుందని సూచనలు చేశారు. బహుశా ప్రకాష్ రాజ్ విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నానని సీ వి ఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కాగా ఇటివలే నటుడు సీ వి ఎల్ నరసింహారావు.. మా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల అక్టోబర్ 10 న జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news