గుడ్ న్యూస్..ఈ నెలలోనే డీఏ, హెచ్‌ఆర్ఏ పెంపు..!

-

ఉద్యోగులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే శాలరీ భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. త్వరలోనే ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ని కేంద్రం పెంచనున్నట్టు పలు మీడియా రిపోర్టులు అంటున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతం లభిస్తుంది. ఈ అలవెన్స్ 34 శాతం పెరగనున్నట్టు తెలుస్తోంది. అలానే ఒకవేళ డియర్‌నెస్ అలవెన్స్ పెరిగితే డియర్‌నెస్ అలవెన్స్ అరియర్స్ కూడా పొందచ్చు. అరియర్స్‌ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుండి డిమాండ్ చేస్తున్నారు.

18 నెలలుగా డీఏ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల 26న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. ఒకవేళ కనుక ప్రభుత్వం వీటిని విడుదల చేస్తే ఉద్యోగులకి డబ్బులు వస్తాయి. ఇది ఇలా ఉంటే హౌజ్ రెంట్ అలవెన్స్ ని కూడా పెంచేలా కనపడుతోంది.

జూలై 2021న కేంద్ర ప్రభుత్వం డీఏను 28 శాతం పెంచింది. ఆ సమయంలోనే హెచ్‌ఆర్ఏను కూడా చూసింది. అర్బన్ కేటగిరీ బట్టి ప్రస్తుతం హెచ్‌ఆర్ఏ రేట్లు 27 శాతంగా, 18 శాతంగా, 9 శాతంగా ఉన్నాయి. అయితే ఒకవేళ కనుక డీఏ పెంపు ఉంటే హెచ్‌ఆర్ఏ కూడా పెరుగుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version