దర్బార్ రిజల్ట్ తెలిసి అల్లూ అర్జున్ – మహేశ్ రియాక్షన్ !!

-

 

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కేవలం తమిళనాడులోనే కాకుండా దేశమంతా.. ఎందుకు ప్రపంచవ్యాప్తంగానే ఒక రేంజ్ లో ఉంటుంది. అతని సినిమా విడుదల అవుతుంది అంటే అప్పట్లో మిగతా హీరోలు తమ చిత్రాలను పోస్ట్ పోన్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉండేవారు.

 

ఈసారి సంక్రాంతికి ఈ మాస్ హీరో తెలుగు లోని రెండు పెద్ద చిత్రాలు ‘సరిలేరు నీకెవ్వరు’ మరియు అల వైకుంఠపురం లో కన్నా ముందే తన దర్బార్ సినిమాను విడుదల చేశారు. రజిని గత కొద్ది కాలంగా తెలుగులో పెద్దగా రాణించలేక పోయినా మురుగదాస్ దర్శకత్వం కాబట్టి ఈ ఇద్దరు పెద్ద హీరోలకు కాస్త వణుకు వచ్చింది.

అయితే ఈ రోజు ఉదయం ఆట పడిన తర్వాత రజిని ‘దర్బార్’ తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు తో పాటు వారి ఫ్యాన్స్ కంగారు పడినా.. తెలుగులో మాత్రం ఆ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో కాస్త కుదుట పడ్డారు.

మొదటి భాగం చాలా బాగున్నా రెండో భాగం పూర్తిగా తేలిపోవడంతో ఈ ఇద్దరు హీరోలు ఫుల్ ఖుషి అయిపోయారట. ఇక ఇదే సమయంలో సంక్రాంతి అయిపోయేవరకు అర్థరాత్రి షో లకు పర్మిషన్ రావడం మరియు దాదాపు పది రోజులు ఉదయం 7 గంటల ఆటకు కూడా ప్రభుత్వం సరే అనడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news