వివేక హత్య కేసులో సీఎం జగన్ నుండి ప్రాణభయం ఉందంటూ వణుకుతున్న దస్తగిరి !

-

ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విప్పు మళ్ళాయి. గత మూడు రోజుల నుండి సిబిఐ ఈ కేసులో దూకుడు చూపిస్తూ మరో వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి సిబిఐ తీరును ఖండిస్తున్నారు. అయితే ఇంతలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దస్తగిరి ఈ కేసులో అరెస్ట్ అయ్యి అప్రూవర్ గా మారాడు. ఈ కేసులో చాలా విషయాలను సిబిఐ కి విచారణలో చెప్పి చాలా మంది మెడకు ఉచ్చులా మారాడు. అందుకే తనకు జగన్ మరియు అవినాష్ రెడ్డి ల నుండి ప్రాణభయం ఉందని చెబుతున్నాడు.

ఈ కేసులో నేను అప్రూవర్ గా మారె సమయంలో కూడా నన్ను అవినాష్ లాంటి వారు ప్రశ్నించలేదని… ఇప్పుడు మాత్రం వాళ్లకు చెడు జరుగుతుందని తెలిసేసరికి నన్ను చాలామంది విమర్శిస్తున్నారు. అందుకే నా ప్రాణాలకు అపాయం ఉందని చెబుతున్నాడు దస్తగిరి.

 

Read more RELATED
Recommended to you

Latest news