ఖచ్చితంగా కాదు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ధోనీ మాటలు..

-

ఖచ్చితంగా కాదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ మాటలు ధోనీ నుండి వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పాక ఐపీఎల్ టోర్నమెంట్ కి మాత్రమే ఆడుతున్న ధోనీ, ఈ సంవత్సరం పెద్దగా పర్ ఫార్మ్ చేయలేదు. ప్లే ఆఫ్ కి వెళ్ళకుండానే టోర్నమెంట్ ని తప్పుకుంది. ఐతే ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదా అన్న ప్రశ్న చాలా మందికి కలిగింది.

 

ఇదే మీ చివరి ఐపీఎల్ అనుకోవచ్చా అని ధోనీని అడగ్గా, ఖచ్చితంగా కాదు అని ధోనీ నుండి సమాధానం వచ్చింది. దీంతో ధోనీ అభిమానులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ కి ధోనీ అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ కి మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. ఐతే ధోనీ రిటైర్ అవబోతున్నాడని తన సహచర ఆటగాళ్ళు ధోనీ జెర్సీని తీసుకుంటున్నారు. దానికి ధోనీ, వాళ్ళు నేను రిటైర్ అవుతున్నారని అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా కాదు అని ధోనీ సమాధానం చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news