IPL 2023 : ఐపీఎల్‌ నుంచి పంజాబ్ ఔట్‌..!

-

IPL 2023 : ఐపీఎల్‌ నుంచి పంజాబ్ వైదొలగనుంది. ధర్మశాలలో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ… పంజాబ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కొండంత లక్ష్యాన్ని చేదించే క్రమంలో తడబడిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరస పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీకి ఇది ఊరటనిచ్చే విజయమే. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ ఈ గెలుపుతో కింది నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఆ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగా, పది పాయింట్లు ఉన్నాయి. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చతికిలపడిన పంజాబ్ కింది నుంచి మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో పంజాబ్ కు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయ్యాయి. ఆ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. అందులో గెలిచినా.. పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news