ఢిల్లీ లిక్కర్ స్కాం అతి జుగుప్సాకరం – భట్టి విక్రమార్క

-

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణాలపై తెలంగాణ సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క స్పందించారు. గాంధీ టోపీలు పెట్టుకుని, మేమే అసలైన గాంధేయవాదులంటూ చెప్పుకున్న “ఆప్” మద్యం మత్తులో కూరుకుపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఢిల్లీ లోని మద్యం విధానం, తెలంగాణ మద్యం విధానం ఒకటేనన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అతి జుగుప్సాకరం అన్నారు బట్టి.

ఓబెరాయ్ హోటల్ లో కూర్చుని ప్రభుత్వ మద్యం విధానాలను రూపొందించడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్ర విభనకు ముందు, తెలంగాణ లో క్వార్టర్ బాటిల్ 30 రూపాయలు ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టి క్వార్టర్ బాటిల్ రూ. 200 అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇంత పెద్ద వ్యత్యాసం ఉన్న డబ్బంతా ఎవరికి పోతోందని ప్రశ్నించారు బట్టి. ఈ.డి, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ లను రాజకీయ నాయకుల పై ప్రయోగించకుండా.. దోపిడీకి గురౌవుతున్న ప్రజల సొమ్ము ను అడ్డుకునేందుకు దర్యాప్తు చేయాలన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలంగాణకు సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయని.. ఢిల్లీ లిక్కర్ స్కాం అతి పెద్ద స్కాం అయునప్పుడు, తెలంగాణ లో ఇంకెంత స్కాం జరిగిందో అనుమానాలు వస్తున్నాయన్నారు. దీంతో సంబంధం ఉన్న వారి అందరిపై సిబిఐ విచారణ కు డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news