విజృంభించిన ఢిల్లీ.. చెన్నై టార్గెట్ 176..

-

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 7వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజృంభించింది. చెన్నైపై భారీ స్కోరు చేసింది. మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

delhi made 175 runs against chennai in ipl 2020 7th match

ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్ పృథ్వీ షా రాణించాడు. 43 బంతుల్లోనే 9 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 64 ప‌రుగులు చేశాడు. మ‌రో ఇద్ద‌రు బ్యాట్స్ మెన్లు రిష‌బ్ పంత్ (37 ప‌రుగులు, 5 ఫోర్లు), శిఖ‌ర్ ధావ‌న్ (35 ప‌రుగులు, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. చెన్నై బౌల‌ర్ల‌లో పీయూష్ చావ్లా 2 వికెట్లు తీయ‌గా శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news