అప్రమత్తతో నా ప్రాణాలు కాపాడుకున్నా – స్మితా సబర్వాల్‌

-

BREAKING : నిన్న అర్థరాత్రి ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ చొరబడ్డాడు. అర్థరాత్రి వేళ మహిళా ఐఏఎస్‌ అధికారి అయిన స్మితా సబర్వాల్ ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ రెడ్డి చొరబడ్డాడు. అయితే, ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్ అరవడంతో అప్రమత్తమైంది భద్రతా సిబ్బంది.

దీంతో డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ ఆనంద్‌ కుమార్‌ రెడ్డితో పాటు, అతని డ్రైవర్‌ ను అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు అధికారులు. అయితే, ఈ సంఘటనపై ఐఏఎస్‌ స్మితా సబర్వాల్ స్పందించారు. రాత్రి అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది.రాత్రి ఓ వ్యక్తి నా ఇంట్లోకి వచ్చాడు. అప్రమత్తతో ప్రాణాలు కాపాడుకున్నాను.. ప్రజలు అందరూ ఇలా అప్రమత్తంగా ఉండాలంటూ స్మితా సబర్వాల్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news