మరో వివాదంలో దేవీ శ్రీ ప్రసాద్.. మా చేతికి చిక్కితే బుద్ధి చెబుతాం అంటున్న రాజాసింగ్

-

రాక్ స్టార్ దేశీ శ్రీ ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’ సినిమా పాటను భక్తి పాటతో పోలుస్తూ కొన్ని కామెంట్లు చేశాడు. ఆ సమయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ.. గోషామహల్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దేవీ శ్రీ ప్రసాద్. 

ఇటీవల ‘ఆడ వాళ్లు మీకు జోహార్లు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిని ఉద్దేశిస్తూ.. ‘‘ఈయన ఎప్పుడూ మాలలోనే ఉంటారు.. మాకేమో శీలా, మాలా, సీత, గీత వంటివి మాకు తెలుసు అంటూ… ఈయన అయ్యప్ప, మురుగన్, వెంకటేశ్వర్ మాటలో ఉంటున్నారు.’’ అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దేవీ శ్రీ ప్రసాద్. ప్రతీ ఏటా లక్షల మంది హిందువులు భక్తి మాలలు వేసుకుంటారు.. ఇలాంటి మాలధారణపై దేవీ శ్రీ ప్రసాద్ వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కు పిచ్చి పట్టిందా…? నీ ప్రాబ్లం ఏమిటీ దేవీ శ్రీ ప్రసాద్ అంటూ.. గతంతో కూడా నువ్వు చీప్ గా మాట్లాడావని.. దేవునిపై నీచంగా మాట్లాడితే.. పనిష్మెంట్ తప్పకుండా ఉంటుందని రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మా చేతికి చిక్కితే తగిన బుద్ధి చెబుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఎందుకు ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news