ఐపీఎల్ 2023: ధావన్ సునామీ ఇన్నింగ్స్ లో కొట్టుకుపోయిన కోహ్లీ రికార్డ్ !

-

గత రాత్రి పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆతిధ్య హైద్రాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ శిఖర్ ధావన్ మినహా అందరూ దారుణంగా విఫలం కావడంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించగలిగాడు. ఈ మ్యాచ్ లో చివరి వారికి నిలబడి 99 పరుగులు చేశాడు. ఈ స్కోర్ తో ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

కోహ్లీ ఐపీఎల్ లో ఇప్పటి వరకు మొత్తం 217 ఇన్నింగ్స్ లలో 50 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేయగా , శిఖర్ ధావన్ మాత్రం కేవలం 208 ఇన్నింగ్స్ లలోనే 51 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కాగా ఈ జాబితాలో వీరిద్దరి కన్నా ముందు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇతను 165 ఇన్నింగ్స్ లలోనే 61 సార్లు సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news