ఆ తప్పే.. నిత్యామీనన్ కెరియర్ కు శాపంగా మారిందా..?

-

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యమీనన్ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తోంది. నిత్యామీనన్ పారితోషకం కంటే తాను ఎంచుకునే పాత్రలకే ప్రాధాన్యత ఉండాలని చూస్తూ ఉంటుంది. నిత్యామీనన్ కి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బాలీవుడ్ ప్రముఖ సంస్థ దగ్గర నిత్యమీనన్ డేట్స్ ఉన్నాయని, ఆ సంస్థ అనుమతి లేకుండా నిత్యామీనన్ ఏ సినిమాకైనా డేట్స్ కేటాయించలేరని తెలుస్తోంది. అయితే ఆ సంస్థను సంప్రదించడం అంత సులువు కాదని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా తన డేట్స్ బాలీవుడ్ కి సంబంధించిన ఒక సంస్థకు అప్పగించడం ఆమె చేసిన తప్పు అని చెప్పవచ్చు. ఆ తప్పే ప్రస్తుతం నిత్యా కెరీర్ కు శాపంగా మారింది. నిత్యామీనన్ వరుస సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిత్యామీనన్ మాత్రం కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. లేకపోతే మరిన్ని కష్టాలు తప్పవని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికీ గ్లామరస్ రోల్స్ కు ఓకే చెప్పి ఉంటే నిత్యామీనన్ కెరియర్ పరంగా మరింత ఎదిగి ఉండే వారని కూడా కొంతమంది అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

నిజానికి నిత్యామీనన్ కి తెలుగుతో పోల్చుకుంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నిత్యామీనన్ ఒక్కొక్క ప్రాజెక్టుకు రెండు కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం నిత్యామీనన్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. మరి ఈ విషయంపై నిత్యామీనన్ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news