మనోజ్ తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చేసిన మంచు లక్ష్మి..

-

మంచు ఫ్యామిలీ ప్రతిసారి ఏదో ఒక రూమర్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.. ముఖ్యంగా వీరిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఇన్ని అన్ని కాదు.. వీరి వ్యక్తిగత జీవితాన్ని సినీ జీవితాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.. అలాగే తాజాగా మంచు లక్ష్మికి విభేదాలు ఏర్పడ్డాయి అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ విషయం క్లారిటీ ఇచ్చేసింది..

తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా లైట్ తీసుకుంటూ ఉంటుంది మంచు లక్ష్మి అలాగే ఈ విషయాలు ఏవి పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకోవడమే కాకుండా అడిగిన వారికి తనదైన రీతిలో సమాధానం చెబుతూ వస్తూ ఉంటుంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు వచ్చిన ఈమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది..

మంచు ఫ్యామిలీపై ప్రతినిత్యం ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉంటాయని తెలిసిందే.. ఈ కామెంట్స్ పై ఆమె ఆసక్తి కరంగా స్పందించారు. తాను మాట్లాడే విధానంపై చాలా మంది విమర్శలు చేస్తుంటారని, వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. అలాగే తనను నిత్యం విమర్శించేవాళ్లు తనలా ఉండరని… అందుకే తనను విమర్శిస్తుంటారని అన్నారు. ఇలాంటి వాళ్లను తాను పట్టించుకోనని చెప్పారు. ఇంకా ఇలాంటివి చాలా జరగొచ్చు.. వాటిని పట్టించుకుంటూ పోతే.. భూమి మీద బ్రతకడం కష్టం అన్నారు అలాగే ఈ భూమి మీద మనిషిగా పుట్టడమే చాలా గొప్ప విషయం.. ఈ పుట్టుకని వేస్ట్ చేసుకోకుండా.. ఏదైనా సాధించాలి. అందుకే మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటానని అన్నారు. అందుకే దీని కోసం తను నటనను ఎంకుకున్నట్టు తెలిపారు. తన ఆలోచనలకు అనుగుణంగానే నటిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నానని చెప్పారు. విష్ణు ఎక్కువగా కుటుంబం, పిల్లలు, వర్క్ పైనే ఫోకస్ చేస్తాడని.. అయితే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవడం వల్లనే తాము ఇదివరకట్లా కలవలేకపోతున్నామంటూ వివరణ ఇచ్చేప్రయత్నంచేసింది మంచు లక్ష్మీ.. అలాగే మనోజ్ తనూ తరచుగా కలుస్తామని, ఎక్కువ టైమ్ ఎంజాయ్ చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news