దిల్ రాజు కరెక్ట్ గానే అంచనా వేశాడు! కాని అజిత్ మాత్రం.!

-

అజిత్ సినిమా తెగింపు జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ అయ్యింది. తమిళ నాడు లో ఈ సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో మాత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అసలు థియేటర్స్ దొరుకుతాయా అనుకున్న టైమ్ లో. కానీ సంక్రాంతి రేసులో మొదటగా ఈ సినిమానే ఇక్కడ రిలీజ్ అయ్యి కొన్ని థియేటర్లు దొరకడం ఈ సినిమా కు కలిసి వచ్చింది. ఇక  దిల్ రాజు సినిమా వెనక్కి వెళ్ళడం తో గోల్డెన్ ఛాన్స్ లభించి ఈ మూవీ కి ఆశించిన ఓపెనింగ్స్ సాధించింది.

ఇక బాలయ్య బాబు మూవీ వీర సింహ రెడ్డి విడుదల కావటం తో అజిత్ సినిమా తెగింపు కు థియేటర్లు లేకుండా పోయాయి. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నేడు విడుదల అవ్వడంతో తెగింపు సినిమా కు ఉన్న థియేటర్లు మొత్తం ఊడ గొట్టారు. అసలే బాలయ్య బాబు, చిరంజీవి బరిలో ఉండడం తో అజిత్ సినిమాకు థియేటర్లు ఇవ్వలేమని చేతులు ఎత్తేశారట.

ప్రస్తుతం కొన్ని మల్టీ ప్లెక్స్ లో, నామ మాత్రంగా సింగిల్స్ లో  ఆడుతున్న తెగింపు సినిమా రేపు అవి కూడా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే రేపు బడా నిర్మాత దిల్ రాజు, తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దానితో ఈ సినిమా కు థియేటర్స్ లభించే అవకాశం లేదని అంటున్నారు. ఈ విషయం గమనించి దిల్ రాజు ముందే నాకు చిరంజీవి, బాలయ్య బాబు అంటే ఇష్టం అని పద్ధతిగా తప్పుకున్నాడు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news