కరోనా బారిన పడ్డ ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్..!

-

కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద బాగా పడింది. షూటింగులు ఆగిపోయి.. హీరోలు, దర్శకులు, అలాగే సినీ వర్గాలకు చెందిన వారంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఇప్పుడిప్పుడే షూటింగులు ప్రారంభమయ్యాయి. దీంతో సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా మరో దర్శకుడు ఈ వైరస్ బారిన పడ్డారు. ఆర్‌ఎక్స్‌ 100తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతికి కరోనా సోకింది.

ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకుంటానని, ప్లాస్మా దానం కూడా చేస్తానని అజయ్‌ వెల్లడించారు. ఇకపోతే అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి సైతం నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news