Veera Simha Reddy : బాలయ్య కోసం జైల్లో డైరెక్టర్ గోపిచంద్ మలినేని..!

-

అఖండ విజయంతో ఫుల్ జోష్ మీదున్న బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నారు. ఓవైపు టాక్ షో.. మరోవైపు రాజకీయాలు.. ఇంకో వైపు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. చాలా రోజులగా ఎదురుచూస్తున్న అభిమానులకు బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ టీమ్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ NBK 107 టైటిల్‌ను ‘వీర సింహా రెడ్డి’గా  ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా దర్శకుడు గోపించద్ మలినేని బాలయ్య బాబు కోసం జైలుకు వెళ్లారు. అదేంటి అనుకుంటున్నారా..! అసలు స్టోరీ ఏంటంటే.. ?

‘‘ఓ బాల‌య్య బాబు ఫ్యాన్‌గా, స‌మ‌రసింహా రెడ్డి రిలీజ్ డే రోజు జైలులో ఉన్న ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే వీరసింహా రెడ్డి. మ‌న ఫ్యాన్స్ అంద‌రూ పండగ చేసుకునేలా సినిమా ఉంటుంది. స‌మ‌రసింహా రెడ్డి ఇచ్చిన‌ వైబ్రేష‌న్స్‌ను ఈ సినిమా ఇస్తుంది. బాల‌య్య బాబుని ఫ్యాన్స్ ఎలా చూడాల‌నుకుంటున్నారో.. దానికి రెండింత‌లు ఎక్కువ‌ క్రేజీనెస్ తో బాలయ్య ఈ సినిమాలో కనిపిస్తారు. సంక్రాంతికి  వీరసింహా రెడ్డి విజృంభించ‌బోతున్నాడు. ఫ్యాన్స్ అంద‌రూ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సినిమా షూటింగ్ ఇంకా 20 రోజులు బ్యాలెన్స్ ఉన్నా స‌రే! ఇప్ప‌టికిప్పుడు సినిమా విడుద‌లైనా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. అంత స్ట‌ఫ్ ఉన్న సినిమా ఇది.” అని గోపిచంద్ మలినేని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news